#mangalagiriaimsdoctorstelephonenumbers,#covid-19,
కరోన అంటువ్యాధి వలన ప్రపంచం గడ గడ లాడుతున్న సంగతి తెలిసిందే. మన ఆంధ్ర రాష్ట్రం లో కూడా లాక్ డౌన్ వలన ఎంతో మంది వారి యొక్క దీర్గ రోగాలతోని గాని, ఆకస్మిక రోగాలతో బాదపడుతున్నవారు గాని ఇక పై ఎయిమ్స్ లో టెలీ వైద్యులను సంప్రదించి ఈ లాక్ డౌన్ సమయం లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ మంగళగ్రిలో ఉన్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో telephone ద్వారా డాక్టర్స్ ను సంప్రదించవచ్చు. ఎయిమ్స్లో రోగుల కోసం టెలీఫోన్ ద్వారా సంప్రదించే సేవలను ప్రారంబించారు. రోగులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకుని ఫోన్ కాల్స్, లేదా వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్ ద్వారా సంప్రదించి వైద్యసేవలు పొందవచ్చు.
వైద్యులను బుధవారం (15-ఏప్రిల్-2020) నుంచి టెలిఫోన్ ద్వారా సంప్రదించే విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఎయిమ్స్ అధికారులు ప్రకటించారు.
ఎయిమ్స్ హాస్పిటల్ లో ఉన్న 85230 01094 సెల్ నంబరులో వీడియోకాల్ లేదా ఆడియోకాల్, సంక్షిప్త సందేశం ద్వారా నిపుణులైన వైద్యులను దిగువ ఇచ్చిన సమయాలలో సంప్రదించవచ్చు.