#webpagelinks, #btechinternship,
ఆంధ్ర ప్రదేశ్ - బీటెక్ పాఠ్యాంశాల్లో 2020 లో మార్పులను తీసుకువస్తుంది. కొత్తగా కొన్ని నైపుణ్య సబ్టెక్సలు అవసరం అని తలచి విద్యాశాఖ ఈ సబ్జెక్టులను ప్రవేశ పెట్టడంతోపాటు ఇంతముందు వుండే ఇంటర్న్షిప్ కాలాన్నిపెంచుతున్నారు.
బీటెక్లో విద్య నేర్చుకున్నప్పటి నుంచే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తలచి అందుకోసం విద్యార్థులు తమ నైపుణ్యాలను ఏ విధంగా పెంపొందించుకోవాలో - వీటిపై అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యాశాఖ మండలి ప్రత్యేకంగా ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది.
మొదటి రెండేళ్లల్లో ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులకు అధనంగా కొత్త సబ్జెక్టులను తీసుకురానున్నారు అవి ఏంటంటే
కమ్యూనికేషన్,
సాఫ్ట్ స్కిల్స్,
మౌఖిక పరీక్షల
సబ్జెక్టులను నేర్పించనున్నారు.
మూడు, నాలుగు సంత్సరం లో విద్యార్థుల కోర్సులకు అనుగుణంగా ఈ సబ్జెక్టులను అందించనున్నారు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ ఆరు నెలలు ఇంటర్న్షిప్ విధానాన్ని 10 నెలలకు పెంచే అవకాశం వుంటుంది.
మొదటి రెండేళ్లు వేసవి నెలవుల్లో రెండేసి నెలలు చొప్పున ఇంటర్న్షిప్ను తీసుకొనే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.
అయితే ఈ కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, మౌఖిక పరీక్షల సబ్జెక్టులను నేర్చుకుంటూ బీటెక్ పూర్తి చేసే విధానం వలన వారియొక్క జీవన సరళిలో మెలుకువలు నేర్చుకొని, జీవితం లో డబ్బు సంపాదనలో నిలదొక్కుకోవటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే జీవితాన్ని ఎలా లీడ్ చేసుకోవాలో కూడా ఈ సబ్జెక్టులు నేర్పుతాయని అందుకని వీటిని తేలికగా చూడరాదని #వెబ్-పేజిలింక్స్, మీకు తెలియ చేస్తుంది.
అలాగే ఇటు కొన్నిజాబ్స్ కి కూడా ఇవి ఇంతగానో ఉపయోగ పడతాయని గమనించ గలరు.
***
No comments:
Post a Comment